Friday, May 3, 2024

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్టులో బరిలోకి దిగిన జట్టే మూడో టెస్టులోనూ ఆడుతుందని కోహ్లీ స్పష్టం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ టెస్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. సిబ్లే స్థానంలో డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చారు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు డ్రాగా ముగియగా.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.

భారత్: కోహ్లీ, రోహిత్, రాహుల్, పుజారా, రహానె, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్

ఇంగ్లండ్: డేవిడ్ మలాన్, ఆర్.బర్న్స్, రూట్, బెయిర్ స్టో, బట్లర్, హమీద్, మొయిన్ అలీ, శామ్ కరణ్, అండర్సన్, రాబిన్‌సన్, ఓవర్టన్

Advertisement

తాజా వార్తలు

Advertisement