Saturday, May 4, 2024

Ind vs Eng : భారత్ తొలి ఇన్నింగ్స్ 445 పరుగులకు ఆలౌట్..

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు, రవీంద్ర జడేజా 112 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు, ధ్రువ్ జురెల్ 46 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 26 పరుగులు చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లు మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీయగా, రెహన్ అహ్మద్ రెండు వికెట్లు, జేమిస్ అండర్సన్ , టామ్ హార్ట్ లీ, జోయ్ రూట్ లు ఒక్కొక్క వికెట్ చొప్పున తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement