Sunday, April 28, 2024

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగుతోంది. ఫస్ట్ వేవ్ పీక్స్ కు వెళ్లిన తర్వాత ఒకానొక దశలో కేసులు వందల్లోనే నమోదయ్యాయి. అయితే సెకండ్ వేవ్ పీక్స్ చేరి ఇప్పటికి 4 నెలలు అవుతోంది. అయితే ఇప్పటికి కరోనా కేసులు మాత్రం ఇంకా తగ్గడం లేదు. దీంతో సెకండ్ వేవ్ ముగిసిందా లేదా.. లేక థార్డ్ వేవ్ వచ్చేసిందా ఆందోళనలు నెలకొన్నాయి. కాగా దేశంలో నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 282 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 31,990 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,604 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,28,15,731కు పెరగగా.. కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,46,050కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,38,205 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 83,39,90,049 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.

ఇది కూడా చదవండి: చైతూ ‘లవ్‌స్టోరీ’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

Advertisement

తాజా వార్తలు

Advertisement