Sunday, May 19, 2024

పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా 658 కొత్త కరోనా కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. సగటున ప్రతి రోజూ 500కు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 628 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4511కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 30, 552మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో316 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 30, కరీంనగర్‌ 18, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 41, రంగారెడ్డిలో 52, నల్గొండ 21, సంగారెడ్డిలో 16, నల్గొండ 15, యాదాద్రి భువనగిరి 11, పెద్దపల్లి జిల్లాల్లో 25 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement