Tuesday, April 30, 2024

నీర‌జ్ ప‌రువు హ‌త్య కేసులో పెరిగిన నిందితుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైద‌రాబాద్ లోని బేగంబజార్ నీరజ్ పన్వార్ పరువు హత్యకేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లు ఉజ్వల్, హృతిక్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 9కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement