Friday, May 3, 2024

వైసీపీ ఎంపీ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ శాఖ ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు మాదాపూర్‌లోని రాంకీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. మరోవైపు రాంకీ సంస్థల ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయోధ్య రామిరెడ్డికి చెందిన ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాంకీ ప్రధాన కార్యాలయంతో సహా 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అయోధ్య రామిరెడ్డి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల పార్టీ జెండా రెడీ

Advertisement

తాజా వార్తలు

Advertisement