Sunday, May 19, 2024

జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చండి.. వీరశైవ లింగాయత్ – లింగబలిజల ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తమను జాతీయస్థాయిలో వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలంటూ వీరశైవ లింగాయత్ – లింగబలిజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం చేపట్టిన ఈ ధర్నాకు ఓబీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు హాజరై సంఘీభావం తెలిపారు. తమ సమాజికవర్గాలు తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ఉన్నాయని, కానీ జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆయా కులాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్య, వీహెచ్ మాట్లాడుతూ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఆ మేరకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. లింగాయత్‌లను ఓబీసీలో చేర్చకపోవడం వల్ల ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతోద్యోగాలతో పాటు మెడికల్ సీట్లలో నష్టపోతున్నామని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement