Saturday, May 18, 2024

తెలంగాణలో వెయ్యి క్రాస్ చేసిన కరోనా కేసులు…ఆరుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు 1000 లోపు ఉన్న ఈ కేసులు…ఇప్పుడు ఆ మార్క్ ను కూడా క్రాస్ చేశాయి. గడిచిన 24 గంటల్లోనే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,078 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 3,10,819కు చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,712కు పెరిగింది. అలాగే ఇప్పటివరకు 3,02,207 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,900గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement