Friday, May 3, 2024

AP | పల్నాడు జిల్లాలో ఘోరం.. బాలిక చేతిలో పేలిన సెల్​ఫోన్​

వేసవి సెలవులు కావడంతో సెల్‌తో ఆడుకుంటున్న ఓ బాలిక చేతిలో ఆ ఫోన్ పేలిపోయింది. దీంతో బాలిక చేయి ఛిద్రం అయ్యింది. 11 ఏళ్ల ఈ బాలికకు తీవ్ర గాయాలైన ఘటన బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జ‌రిగింది. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో సెల్​ఫోన్​ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. వెంటనే 108కు సమాచారమిచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. సెల్​ఫోన్​ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement