Sunday, April 28, 2024

విశాఖ‌లో అక్ర‌మ తవ్వ‌కాలు..ఎన్ జీటీ చైర్మ‌న్ కి ఎంపీ ర‌ఘురామ లేఖ‌..

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజు సొంత పార్టీ నేత‌లే కాదు సాక్షాత్త్ సీఎంపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు ఆయ‌న రాసిన ఓ లేఖ సంచ‌ల‌నాకి దారి తీసింది. ఎన్ జీటీ చైర్మ‌న్ ఆద‌ర్శ‌కుమార్ గోయ‌ల్ కి ర‌ఘురామ లేఖ రాశారు. విశాఖ ప‌ట్నం రుషికొండ ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘన జ‌రుగుతోంద‌ని ఫిర్యాదు చేశారు. అక్ర‌మ త‌వ్వ‌కాలు..నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. ఏపా ప‌ర్యాట‌క శాఖ‌, ప‌ట్ట‌ణ మున్సిప‌ల్ శాఖ అమ‌లులో ఉన్న ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టింస్తోంది. వీటిపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆ లేఖ‌లో ర‌ఘురామ రాజు పేర్కొన్నారు. ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement