Sunday, May 5, 2024

కన్నాకు సిగ్గుంటే టీడీపీలో చేరడు.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారో చెప్పాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సిగ్గులేదని అన్నారు. నిజంగా సిగ్గుంటే ఆయన ఆ పార్టీలో చేరి ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు.

‘బాబు రావాలి.. జాబు రావాలి’ అంటూ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. రాజధాని నిర్మించారా? పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చారా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? కనీసం స్పెషల్ ప్యాకేజి తెచ్చారా? అంటూ కేఏ పాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏం సాధించారని చంద్రబాబు చెంతన చేరారో కన్నా చెప్పాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement