Friday, May 3, 2024

రేపు రూ.300 సేవా టికెట్ల.. ఆన్‌లైన్‌ కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి నెలకుగాను రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకోవాలని కోరడమైనది. ఏప్రిల్‌,మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదేవిదంగా మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్‌ సేవా టికెట్ల కోటాను ఈ నెల 24 సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement