Wednesday, May 8, 2024

న‌టి జాక్వెలిన్ ని ర‌క్షించేందుకు నేనున్నా.. సుకేశ్

హీరోయిన్ జాక్వెలిన్ ని ర‌క్షించేందుకు తాను ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు రూ. 200 కోట్ల దోపిడి కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్. ఈ కేసుకు సంబంధించి సినీ నిర్మాత కరీం మొరానీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను శుక్రవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.దోపిడీ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సుకేశ్ సమాధానం ఇచాడు. జాక్వెలిన్ ఈ కేసులో భాగం కాదని, ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమెను రక్షించడానికి తాను ఉన్నానని స్పష్టం చేశాడు. జైలు శిక్ష అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తన వాంగ్మూలం ఇచ్చాడు. జైన్‌ తనపై బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడ్డారని సుకేశ్ గతంలో ఆరోపించాడు. ఈ విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ కూడా రాశాడు. తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆప్ నేత తనపై ఒత్తిడి తెస్తున్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. జైన్‌ను ఢిల్లీ క్యాబినెట్‌ నుంచి భర్తరఫ్ చేయాలని ప్రభుత్వానికి సుకేశ్ కోర్టులో సవాలు విసిరారు. ఢిల్లీ కోర్టు సుకేశ్ ఈడీ కస్టడీని సోమవారం వరకు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement