Friday, April 26, 2024

వ‌చ్చే నెల‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ హ్యుందయ్‌ ఎక్స్‌టర్‌..

అత్యాధునిక ఫీచర్లతో హ్యుందయ్‌ సంస్థ మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ తీసుకొస్తోంది. హ్యుందయ్‌ ఎక్స్‌టర్‌ పేరుతో దీనిని జులై నాటికి అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.11,000 తో బుకింగ్స్‌ను ఆహ్వానించిన హ్యుందయ్‌ డెలివరీలను కూడా వేగవంతం చేస్తామని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెబుతోంది. భారతీయ విపణిలో ఎక్స్‌టర్‌ ఈఎక్స్‌ ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌(0) , ఎస్‌ఎక్స్‌ (0) కనెక్ట్‌ పేరుతో ఐదు మోడళ్లను విడుదల చేయబోతున్నది.

ఇతర మోడళ్ల కంటే డిజైన్‌పరంగా భిన్నంగా ఉంటుంది. ఇందులో హెచ్‌ షేప్‌ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌, స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్‌ సెటప్‌ కనిపిస్తుంది. డ్యుయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌, రూఫ్‌ రెయిల్స్‌, సి పిల్లర్‌కు టెక్చర్డ్‌ ఫినిషింగ్‌ వంటి వాటితోపాటు ఫ్లోటింగ్‌ రూఫ్‌ ఎఫెక్ట్‌తో డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ ఆప్షన్లున్నాయి. రియల్‌ ప్రొఫైల్‌లో నిలువుగా ఉండే టెయిల్‌ గేట్‌, షార్క్‌ఫిన్‌ యాంటెన్నా, బిల్ట్‌ -ఇన్‌ స్పాయిలర్‌, టెయిల్‌-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. భద్రత ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ప్రారంభధర రూ 6లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement