Wednesday, April 17, 2024

భారత్‌లో క్లౌడ్‌ ఇన్‌ఫ్రా కోసం లక్ష కోట్ల పెట్టుబడులు.. పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

పెరుగుతున్న క్లౌడ్‌ సేవల కోసం, కస్టమర్‌ డిమాండ్‌ను తీర్చడానికి 2030 నాటికి భారతదేశంలో క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సుమారు లక్ష కోట్లు (12.7 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఎడబ్ల్యుఎస్‌) గురువారం ప్రకటించింది. భారతదేశంలో డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి భారతీయ వ్యాపారాలలో సగటున ప్రతి సంవత్సరం 1,31,700 పూర్తి-సమయ ఉద్యోగాలకు మద్దతు ఇస్తుందని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ యూనిట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

నిర్మాణం, సౌకర్యాల నిర్వహణ, ఇంజనీరింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌, ఇతర ఉద్యోగాలతో సహా ఈ స్థానాలు భారత దేశంలోని డేటా సెంటర్‌ సరఫరా గొలుసులో భాగం. 2016- 2022 మధ్య 30,900 కోట్లు (3.7 బిలియన్‌ డాలర్లు)తో ప్రారంభమైన పెట్టుబడులు భారతదేశంలో 2030 నాటికి 1,36,500 కోట్లు (16.4 బిలియన్‌ డాలర్లు)కు చేరుతుందని అంచనా. ఈ పెట్టుబడి 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి రూ.1,94,700 కోట్లను జోడిస్తుంది.

ఉద్యోగ అవకాశాలు పుష్కలం..

- Advertisement -

శ్రామికశక్తి అభివృద్ధి, శిక్షణ, నైపుణ్య అవకాశాలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, సుస్థిరత కార్యక్రమాలు వంటి రంగాలలో భారతదేశంలో దాని పెట్టుబడి స్థానిక ఆర్థిక వ్యవస్థపై అలల ప్రభావాన్ని చూపుతుందని ఎడబ్ల్యుఎస్‌ తెలిపింది. కంపెనీకి భారతదేశంలో రెండు డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రీజియన్‌లు ఉన్నాయి. ఎడబ్ల్యుఎస్‌ ఆసియా పసిఫిక్‌ (ముంబయి) ప్రాంతం, 2016లో ప్రారంభించబడింది.

ఆసియా పసిఫిక్‌ (హైదరాబాద్‌) ప్రాంతం నవంబర్‌ 2022లో ప్రారంభించబడింది. రెండు %ఆఔా% రీజియన్‌లు భారతీయ కస్టమర్‌లకు మరింత ఎక్కువ స్థితిస్థాపకత మరియు లభ్యతతో పనిభారాన్ని అమలు చేయడానికి, భారతదేశంలో డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు అంతిమ వినియోగదారులకు తక్కువ జాప్యంతో సేవలందించడానికి బ#హుళ ఎంపికలను అందించడానికి రూపొందించబడ్డాయి” అని ఇది తెలిపింది. కాగా, తాజా పెట్టుబడి భారతదేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఉత్ప్రేరకపరుస్తుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement