Monday, April 29, 2024

మాస్క్ పెట్టుకోలేదని మాజీ మేయర్‌కు జరిమానా

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా విధించారు. క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు పలు వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి పోలీసులు జ‌రిమానా విధించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా రెడ్డి త‌న కారులో వెళ్తుండ‌గా పోలీసులు ఆపారు. మాస్కు ధ‌రించ‌ని తీగ‌ల కృష్ణారెడ్డికి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో తీగ‌ల కృష్ణారెడ్డి, ముఖేష్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల్సిందేన‌ని తీగ‌ల‌కు ఎస్ఐ తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement