Monday, May 6, 2024

Hyderabad: కూతురును చంపి తల్లి ఆత్మహత్య

ఓ కూతురును చంపి త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ నగరంలో చోటు చేసుకున్నది. న‌గ‌రంలోని నాచారం పీఎస్‌ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశేఖర్‌కు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు జన్మనించింది. అయితే, కూతురు పుట్టిందని తరుచూ భర్త వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. భార్య, బిడ్డను చంద్రశేఖరే చంపి ఉంటాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement