Monday, April 29, 2024

హైద‌రాబాద్ లో చైన్ స్నాచింగ్ – భ‌యాందోళ‌న‌లో మ‌హిళ‌లు

ఓ మ‌హిళ మెడ‌లో నుంచి నాలుగు తులాల బంగారాన్ని లాక్కెళ్లారు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ కేపీహెచ్ బీలో చోటు చేసుకుంది. కాగా చింత‌ల్ లో కూడా ఓ మ‌హిళ మెడ‌లోనుంచి 2.5 తులాల బంగారుచైన్ ను ఎత్తుకెళ్ళారు దొంగలు. కేవ‌లం మూడురోజుల్లో ఆరు చైన్ స్నాచింగ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాంతో న‌గ‌ర‌వాసులు భ‌యాందోళ‌న‌కి గుర‌వుతున్నారు. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 2లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దొంగ.. పద్మజా రెడ్డి అనే మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుని వెళ్లిపోయాడు. నాలుగు తులాల బంగారు చైన్ దొంగిలించినట్టుగా బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ప్రాంతంలో దొంగ తిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement