Saturday, May 18, 2024

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అభివృద్ధి : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని ఎవరూ కలలో కూడా ఉహించని విధంగా.. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలో రూ.7.20 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఒక్క నిమిషం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేని స్థితిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement