Wednesday, May 1, 2024

భారీగా పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు

దేశం నుంచి చేస్తున్న ఎగుమతుల్లో స్టార్ట్‌ ఫోన్లు 5వ స్థానంలో ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ హర్మనైయిజ్డ్‌ కోడ్‌ (ఐహెచ్‌ఎస్‌0 ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఎగమతులు జరిగిన 20 వస్తువుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఐదో స్థానంలో ఉన్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 9 వస్థానంలో ఉన్నాయి. ఐహెచ్‌ఎస్‌ కోడ్‌తో ఎగుమతి అవుతున్న వాటిలో డీజిల్‌, ఏవియేషన్‌ ప్యూయల్‌, గ్యాసోలిన్‌, డైమండ్స్‌ వంటివి ఉన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన వివరాలు, ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఈఏ) తెలిపిన దాని ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 45,000 కోట్ల విలువైన స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు జరిగాయి.

ఇది 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 88,726 కోట్ల విలువైన స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు జరిగాయని తెలిపింది. స్మార్ట్‌ ఫోన్లకు మూడు రకాలైన హెచ్‌ఎస్‌ కోడ్స్‌ కలిగి ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 1,20,000 కోట్ల నుంచి 2026 నాటికి ఎగుమతులు 4 లక్షల కోట్లకు చేరుతాయని ఐసీఈఏ అంచనా వేసింది. స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతుల్లో ప్రధానంగా సగం వాటా యాపిల్‌ ఐఫోన్లదే. దీని తరువాత శామ్‌సంగ్‌ ఫోన్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. 2026 నాటికి మన దేశంలో 25 శాతం ఐఫోన్లు తయారవుతాయని అంచనా. ఇది 20 బిలియన్‌ డాలర్లకు సమానం.

- Advertisement -

స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 5వ స్థానంలో ఉంటే, గ్యాసోలిన్‌ ఎగుమతులు 4వ స్థానంలో ఉంది. 1,19,716 కోట్ల విలువైన గ్యాసోలిన్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నందున ఈ సారి డైమండ్స్‌ ఎగుమతులు 10-15 శాతం వరకు తగ్గాయి. అయితే ఎగుమతి చేస్తున్న స్మార్ట్‌ ఫోన్లలో దిగుమతి చేసుకుంటున్నవి విలువ జోడింపులో 12-18 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్‌ఐ) స్కీమ్‌లో ప్రోత్సహకాలు అందించడం ద్వారా ఇది 40 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement