Tuesday, April 30, 2024

Lucknow : గెలిచేందుకు ఎన్ని వేషాలో… మెడ‌లో చెప్పుల దండ‌తో ప్ర‌చారం

ఆయ‌న ఎన్నిక‌ల గుర్తే పాద‌ర‌క్ష‌లు
అదే అత‌డికి ప్ర‌చార అయుధం
అలీఘ‌డ్ లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధి వినూత్న క్యాంపెయిన్
ల‌క్నో – ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వివిధ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు ఆసక్తి రేపుతుంటాయి. తమకు కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ప్రచారంలో వాడుకునే తీరు మరింత ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ ఎన్నికల్లో కూడా ఓ అభ్యర్థి తనకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి పండిట్‌ కేశవ్‌ దేవ్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం పాదరక్షల గుర్తును కేటాయించింది. దాంతో ఆయన ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లకు తన గుర్తు బాగా గుర్తుండిపోవాలనే తాను ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని పండిట్‌ కేశవ్‌ దేవ్‌ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement