Monday, April 29, 2024

Breaking | కుత్బుల్లాపూర్​లో నీట మునిగిన ఇండ్లు.. స్వయంగా పరిశీలించిన బీజేపీ నేత

కుత్బుల్తాపూర్​ (ప్రభ న్యూస్​): నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వానలతో కుత్బల్లాపూర్​ అతలాకుతలమవుతోంది. నియోజకవర్గంలోని 132 జీడిమెట్ల డివిజన్​ పరిధి, శ్రీనివాసనగర్​ని వరద ముంచెత్తింది. కాలనీలోని చాలా ఇండ్లు నీటమునిగాయి. బీజేపీ మేడ్చల్​ అర్బన్​ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్​సింహారెడ్డి కాలనీలో పర్యటించారు. పరిస్థితులను స్వయంగా చూశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అదేవిధఫ‌గా ఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుందని కాలనీవాసులు తెలిపారు. దీంతో ఆ కాలనీలో పర్యటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్ లో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏ అవసరం ఉన్నా తమను సంప్రదించాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement