Thursday, April 25, 2024

తమ పట్ల భారత్ వైఖరి మార్చుకోవాలి: తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. అప్ఘనిస్తాన్ చరిత్రలో సోమవారం గుర్తుండిపోయే రోజు అని తాలిబన్ల అధికార ప్రతినిధి షహీర్ సుహైల్ ప్రకటించారు. తమకు భారత దేశం మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాలిబన్ పాలనకు, ఈసారి పాలన భిన్నంగా ఉంటుందని అన్నారు. ఇంతకుముందు కంటే వేరుగా తాము పరిపాలన ఎలా కొనసాగించబోతున్నారో ఆయన వివరించారు. విదేశీ సహకారానికి సంబంధించి తీసుకోబోతున్న చర్యల గురించి కూడా మాట్లాడారు.

ఆఫ్ఘనిస్థాన్‌ను తాము పునర్నిర్మించబోతున్నామని, అందుకు సహకరించాలని మిగిలిన దేశాలను కోరారు. ఈ క్రమంలోనే భారత్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. తమకు మద్దతునివ్వాలని కోరారు. ‘భారత్ ఇంతకుముందు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయింది. భారత్ కూడా తన వైఖరి మార్చుకుంటుందని ఆశిస్తున్నాం. అలా జరిగితేనే ఇరు దేశాలకు, ఇరు దేశాల ప్రజలకూ మంచిది’ అని సుహైల్ పేర్కొన్నారు. అలాగే తమ సేనలు కాబూల్‌లోకి ప్రవేశించాయని, అక్కడి భద్రతకు భంగం కలుగకుండా ఉండేందుకు, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకుండా పరిరక్షించేందుకు, ప్రజల ప్రాణాలు పోకుండా రక్షించేందుకు నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నామని సుహైల్ వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రక్షించాలంటూ కేంద్రానికి సీఎం లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement