Friday, April 26, 2024

ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రక్షించాలంటూ కేంద్రానికి సీఎం లేఖ

అఫ్గానిస్థాన్‌ మొత్తం ఇప్పుడు తాలిబన్‌ల చేతిలో చిక్కుకుని విలవిలలాడుతోంది. దీంతో అన్ని దేశాల ప్రజలు పెట్టే బెడా సర్దుకుని స్వదేశాలకు ఫ్లైటెక్కేస్తున్నారు. భారతీయులు కూడా త్వరగా ఇండియా వచ్చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎయిర్ ఇండియా గగన తలాన్ని మూసివేయడంతో అక్కడి భారతీయులకు షాక్ తగిలింది.

ఈ మేరకు అప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న 200 మంది సిక్కులను రక్షించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అక్కడి గురుద్వారాలో తలదాచుకుంటున్న సిక్కులను వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని విదేశాంగ శాఖను ట్విట్టర్‌లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని ఇక్కడకు రప్పించేందుకు అన్నివిధాల కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: వీడియో: కాబూల్ ఎయిర్‌పోర్టులో ఇది పరిస్థితి

Advertisement

తాజా వార్తలు

Advertisement