Friday, April 26, 2024

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను హడలెత్తించిన షమీ-బుమ్రా

లార్డ్స్ టెస్టులో టీమిండియా లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. చివరిరోజు డ్రా కోసం పోరాడాలంటే తప్పక నిలవాల్సిన స్థితిలో షమీ, బుమ్రా మేజిక్ చేశారు. ఐదోరోజు ప్రారంభంలోనే పంత్ (22) వికెట్‌ను భారత్ కోల్పోగా ఇషాంత్ కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. వీరిద్దరినీ రాబిన్‌సన్ తన బుట్టలో వేసుకున్నాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందని అందరూ భావించారు.

అయితే ఇక్కడే షమీ, బుమ్రా షో మొదలైంది. బ్యాట్స్‌మన్ తరహాలో షమీ స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. దీంతో కెరీర్‌లో రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ బ్యాటింగ్‌లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతడికి బుమ్రా చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ 9వ వికెట్‌కు అభేద్యంగా 77 పరుగులు జోడించారు. భారత్ లంచ్ సమయానికి 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో షమీ (52 బ్యాటింగ్), బుమ్రా (30 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ ఈ టెస్టును ఇక డ్రా చేయడం కోసమే పోరాడాలి. భారత బౌలర్లు విజృంభిస్తే ఆ జట్టుకు నష్టం తప్పకపోవచ్చు.

ఈ వార్తను కూడా చదవండి: తొలి టెస్టులో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ ఉత్కంఠభరిత విజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement