Monday, April 29, 2024

యూపీలో పరువు హత్య.. సోదరి తల నరికేసి, రోడ్డుపై ప్రదర్శన

ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. బారాబంకి జిల్లా ఫతేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మిత్వారా గ్రామంలో 19ఏళ్ల అమ్మాయి, అదే గ్రామానికి చెందిన చాంద్‌బాబు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసీ పంచాయతీ పెట్టారు. అయినా ప్రేమికులిద్దరూ వినకుండా తమ ప్రేమాయణం కొనసాగించారు. అమ్మాయి సోదరుడు రియాజ్‌ పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.

ఇదే విషయమై సోదరితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్‌ ఇంట్లోని కత్తితో అమ్మాయి తల నరికాడు. ఆ తర్వాత రియాజ్‌ ఆ తలను తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి పోలీసులు చేరుకోగా, లొంగిపోవడానికే పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నట్లు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement