Monday, April 29, 2024

విశాఖ‌లో హానీ ట్రాప్ – సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ అరెస్ట్ …

విశాఖ‌ప‌ట్నం – సీఐఎస్‌ఎఫ్‌‌కు చెందిన కానిస్టేబుల్ ఒకరు పాకిస్తాన్ యువతి హానీ ట్రాప్‌లో ప‌డ్డాడు. . ఈ క్రమంలోనే కొంత రహస్య సమాచారం కూడా చేరవేసినట్టుగా సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు గుర్తించి అత‌డిని అరెస్ట్ చేశారు.. వివ‌రాల‌లోకి వెళితే హానీట్రాప్ కు గురైన కపిల్ కుమార్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు. కపిల్ కుమార్ గతంలో రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కపిల్ కుమార్‌పై హనీ ట్రాప్ వల విసిరింది.

పాక్ కు చెందిన తమీషా అనే మహిళతో కపిల్‌ కుమార్‌కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కదలికలపై ఉన్నతాధికారులు అనుమానం వచ్చింది. దీంతో అత‌డిపై నిఘా ఉంచారు.. అధికారిక రహస్యాల చేర‌వేస్తుండ‌టంతో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. ఇక, అతని వద్ద నుంచి మొబైల్స్‌ను సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును మ‌రింత లోతుగా విచారిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement