Friday, May 3, 2024

Missing | పీజీ వైద్య విద్యార్థి అదృశ్యం..  సంగారెడ్డి జిల్లాలో ఘటన

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): సంగారెడ్డి జిల్లాలో  ఓ వైద్యవిద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన ఇవ్వాల (సోమవారం) చోటుచేసుకుంది. ఫసల్ వాది లోని ఆశిష్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న తమిళనాడుకు చెందిన గోకుల్ నాథ్ (27) అనే వైద్య విద్యార్థి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అలాగే పీజీ కూడా చేస్తున్నాడు. గోకుల్ నాథ్ ఈనెల 5వ తేదీన ఉదయం ఆసుపత్రిలో డ్యూటీకి వెళ్లి హాస్టల్ కి తిరిగి వచ్చాడు. అదే రోజు రాత్రి తన తల్లిదండ్రులకు వాట్సాప్ లో సూసైడ్ నోట్ పెట్టి  అదృశ్యమయినట్టు తెలుస్తోంది.

రోజు మాదిరిగానే తల్లిదండ్రులకు ఫోన్ చేసే గోకుల్ నాథ్ తమకు  కాల్ చేయలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ నిర్వాహకుల కు తాము ఫోన్ చేయగా, అతను కూడా ఫోన్ చేశాడని, గోకుల్ నాథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని హాస్టల్ నిర్వాహకుడు నరసింహారావు వైద్య విద్యార్థి తల్లిదండ్రులకి తెలిపారు. దీంతో కలవరపడిన గోకుల్ నాథ్ తల్లిదండ్రులు హుటాహుటిన తమిళనాడు నుంచి సంగారెడ్డికి చేరుకొని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement