Monday, May 6, 2024

హోంమంత్రిని కలసిన ప్రతిపాడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు..

ప్రతిపాడు వ్యవసాయశాఖ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా నూతనంగా నియమితులైన వారు హోంమంత్రి సుచ‌రిత‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గొట్టిపాడు కి చెందిన మేడ ఉషారాణి, తుమ్మలపాలెం లకు చెందిన శ్రీ లక్ష్మి, ప్రతిపాడు బాపతు వెంకటరమణలు బ్రాడీపేట లోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో సుచరితని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి … డైరెక్టర్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ దాసరి అనుమతించ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు విజయ్ కుమార్, గొట్టిపాడు మాజీ సర్పంచ్ గుంటుపల్లి బాబురావు, సాగర్ కుడి కాలువ మాజీ చైర్మన్ గుంటుపల్లి వీర భుజంగ రాయలు, మాజీ ఎంపీటీసీ మహేంద్ర, పార్టీ నాయకులు.. కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement