Monday, April 29, 2024

29, 30న స్కూళ్లకు సెలవులు.. గ్రూప్‌-2 పరీక్ష ఏర్పాట్లు చేస్తోన్న‌ టీఎస్‌పీఎస్‌సీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేదుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్‌-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

783 గ్రూప్‌-2 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29, 30 తేదీల్లో నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. గతంలో జరిగిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో ఈసారి గ్రూప్‌-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ చర్యలు చేపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement