Monday, April 29, 2024

తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు హైకోర్టు షాక్

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం రూ. 58 కోట్ల మంజూరుపై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లెక్చరర్ ప్రభాకర్ పిల్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరపగా కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలన్న హైకోర్టు… ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ప్రశ్నించింది. ఈ సందర్భంగా రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే సీఎస్ సోమేశ్ కుమార్‌కు కూడా వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇక మిగతా విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు నిధులు విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్త కూడా చదవండి: సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement