Sunday, April 28, 2024

మావోయిస్టు ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మావోయిస్టు ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసుపై హైకోర్టులో ఈ రోజు (బుధవారం) విచారణ జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ఉత్తర్వులను పోలీసులు సవాల్‌ చేశారు. వాదనలను వినకుండా జిల్లా కోర్టు నిర్ణయం వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వాదనలను విని నిర్ణయం తీసుకోవాలని జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు మాసాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్‌ కోర్టును హైకోర్టు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement