Monday, April 29, 2024

కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన.. అల్లు అర్జున్

పుష్ప‌2తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. స్టార్ హీరో ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్‌ కుమార్‌ దీనికి నిర్మాత. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్నఈ సినిమా గురించి చిత్ర యూనిట్ శుక్ర‌వారం ప్రకటన చేసింది. బన్నీ, సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్, ఇతర సహ నిర్మాతలు కలిసున్న ఫొటోను టీ సిరీస్ ట్విట్టర్ లో షేర్ చేసింది. టీ సిరీస్‌, సందీప్‌ హోం బ్యానర్‌ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అల్లు అర్జున్ కి ఇది 23వ చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement