Monday, April 29, 2024

ఎల్‌బీనగర్‌ కామినేని టు బేగంపేట కిమ్స్‌.. 16 నిమిషాల్లో గుండె, ఊపిరితిత్తుల తరలింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరోసారి గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు.. ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేటలోని కిమ్స్‌ ఆస్పత్రికి కేవలం 16 నిమిషాల్లో గుండె, ఊపిరితిత్తులను తరలించారు. ఉదయం 10.01 గంటలకు బయలుదేరిన అంబులెన్స్‌ ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం ఎదుర్కొకుండా 17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో అధిగమించింది. సరిగ్గా ఉదయం 10.17 గంటలకు గుండె, ఊపిరితిత్తులతో కిమ్స్‌ కు చేరింది.

నల్గొండ జిల్లా మునుగోడు వద్ద ఈ నెల 5న ఆండాలు(40) అనే ఆవిడ‌ కూలీ పనుల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని కుటుంబసభ్యులకు తెలిపారు. ఆండాలు అవయవాలు(గుండె, ఊపిరితిత్తులు) దానం చేసేందుకు వారు అంగీకరించారు. సకాలంలో అవయవ మార్పిడి కోసం రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులను ఆస్పత్రుల యాజమాన్యం, సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement