Thursday, May 2, 2024

Delhi: ఉపరాష్ట్రపతి ధన్కడ్‌ను కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ భేటీలో ధన్కడ్‌కు దత్తాత్రేయ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహుకరించారు.

ఈ భేటీ సందర్భంగా హర్యానా రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల గురించి, సామాజిక స్థితిగతులు, వారసత్వ సంపద గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు తెలిసింది. మహాభారత ఇతిహాసంతో ముడిపడ్డ కురుక్షేత్ర ప్రాంతాన్ని సందర్శించాల్సిందిగా దత్తాత్రేయ ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. ధన్కడ్‌తో భేటీ కంటే ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement