Monday, April 29, 2024

ఇటు టీమిండియా.. అటు ఇంగ్లండ్ జట్లకు గాయాల బెడద

రెండో టెస్టుకు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లను గాయాల బెడద వేధిస్తోంది. టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్, ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ గాయపడినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శార్దూల్‌కు తొడ కండ‌రాలు ప‌ట్టేయగా.. వార్మప్ మ్యాచ్‌లో బ్రాడ్ గాయపడ్డాడని జట్టు వర్గాలు వెల్లడించాయి.

అటు తొలి టెస్ట్‌లో శార్దూల్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో క‌లిపి అత‌డు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రెండో టెస్ట్‌కు శార్దూల్ దూర‌మైతే అత‌ని స్థానంలో అశ్విన్ లేదంటే పేస్ బౌల‌ర్లు ఇషాంత్‌, ఉమేష్‌ల‌లో ఒక‌రిని తీసుకునే అవ‌కాశం ఉంది. తొలి టెస్ట్‌లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివ‌రి రోజు మొత్తం వ‌ర్షం కుర‌వ‌డంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కీలక బౌలర్లు ఆర్చర్, వోక్స్ సేవలను కోల్పోయింది. ఇప్పుడు బ్రాడ్ కూడా గాయపడటంతో అతడి స్థానంలో రెండో టెస్టుకు మార్క్ వుడ్ ఆడే అవకాశం ఉంది.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

Advertisement

తాజా వార్తలు

Advertisement