Thursday, May 2, 2024

అక్రమంగా తరలిస్తున్న గుట్కా… ఇద్దరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో నిషేధిత గుట్కా పై కియ పోలీసులు, పెనుకొండ సెబ్ విభాగం పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు పర్యవేక్షణలో పెనుకొండ సి.ఐ వెంకటేశ్వర్లు, కియ ఎస్సై ఖాజా హుస్సేన్, సిబ్బంది , పెనుకొండ సెబ్ సి.ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సెబ్ విభాగం సిబ్బందితో కలసి కియ పరిశ్రమ సమీపంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ట్రక్కును పట్టుకున్నారు. గుట్కా పాన్ మసాలా పాకెట్లను ఇద్దర్ని అరెస్టు చేసి రూ 24 లక్షల విలువ చేసే గుట్కా పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement