Friday, May 17, 2024

‘శ్రీ సింహ’ బ‌ర్త్ డే – దొంగ‌లున్నారు జాగ్ర‌త్త ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

హీరో శ్రీ సింహ దొంగ‌లున్నారు జాగ్ర‌త్త చిత్రంలో లీడ్ రోల్ ని పోషించ‌నున్నాడు. నేడు శ్రీ సింహ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో డిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాడీ హీరో. 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమాతో శ్రీసింహ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సైమా బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ పోషించాడు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెర‌కెక్క‌నుందీ చిత్రం.ఈ చిత్రాన్ని సతీశ్ త్రిపుర డైరెక్ట్ చేయనున్నాడు. సినిమా కథనూ అతడే రూపొందించాడు. సురేశ్ బాబు, తాటి సునీతలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మంజర్ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. శ్రీ సింహ సోదరుడు కాల భైరవ స్వరాలను సమకూర్చనున్నాడు. ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్, సినిమాటోగ్రాఫర్ గా యశ్వంత్ సి వ్యవహరించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement