Saturday, May 11, 2024

వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత కనుమూరి హరిశ్చంద్రరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని హరిశ్చంద్రరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరు ప్రజలకు సేవ చేస్తానన్నారు. పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని, పార్టీ కోసం శ్రమిస్తున్న తనపై అసత్య ఆరోపణలు చేశారని వాపోయారు. రాజకీయాల్లోకి పొరపాటున వచ్చానని, రాజకీయాలకు తాను కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తనకు సహకరించిన వైసీపీ కార్యకర్తలు. అభిమానులకు హరిశ్చంద్రరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా తిరుపతి ఉపఎన్నిక క్రమంలో హరిశ్చంద్రరెడ్డి రాజీనామా చేయడం వైసీపీ వర్గాలను షాక్‌కు గురి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement