Monday, April 29, 2024

మాధ‌వ‌న్ కుమారుడి ఘ‌న‌త‌.. భార‌త్‌కు 5 బంగారు ప‌త‌కాలు

నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో ఉబ్బిత‌బ్బిబ్బు అవుతున్నాడు. స్విమ్మింగ్ కాంపిటిషన్‌లో తన కుమారుడు వేదాంత్ ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియాలో షేర్ చేసి, త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. ‘‘దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ భారత్‌కు ఐదు బంగారు పతకాలు (50 మీటర్లు, 100, 200, 400, 1500 విభాగాల్లో) సాధించాడు. కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ చాంపియన్ షిప్‌లో ఈ పతకాలను గెలుచుకున్నాడు’’ అని మాధవన్ ఇన్‌స్టా వేదికగా హర్షం వ్యక్తం చేశాడు.

కాగా, ఈ విష‌యంలో మాధవన్‌ను చాలా మంది అభినందించారు. రిప్ల‌య్ ఇచ్చారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు మాధవన్‌ను సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. వేదాంత్ మాధవన్ గతంలోనూ పలు స్విమ్మింగ్ టోర్నమెంట్లలో తన సత్తా చాటుకున్నాడు. కొన్ని ఏళ్లుగా పలు ప్రఖ్యాత పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీం మహారాష్ట్ర తరపున ఖేలో ఇండియా 2023లో పాల్గొన్న వేదాంత్ ఐదు బంగారం, రెండు వెండి పతకాలను గెలుచుకున్నాడు. గతేడాది జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో మాధవన్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement