Friday, May 3, 2024

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 5 శాతం డీఏ ప్ర‌కటించిన ప్ర‌భుత్వం

ప్ర‌భ‌న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసి క‌బురు చెప్పింది. మూల వేత‌నంపై 5 శాతం డీఏను చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్టీసీ… వ‌చ్చే నెల నుంచి ఉద్యోగుల‌కు వేత‌నాల‌కు అద‌నంగా 5 శాతం డీఏ క‌లిపి చెల్లించ‌నున్న‌ట్లు టీఎస్సార్టీసీ ప్ర‌క‌టించింది. దీనితో సంస్థ‌పై నెల‌కు రూ.5 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.600 నుంచి గరిష్ఠంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంద‌ని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement