Saturday, July 27, 2024

MDK | జొన్న రైతులకు శుభవార్త… మార్క్ ఫెడ్ ధ‌ర పెంపు

మెదక్ జిల్లాలో ప్రతి ఎకరాకు 8 క్వింటాల్ల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం వల్ల రైతులను మిగతా పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలు తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ… రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారు. మెదక్ జిల్లాలోని జొన్న రైతుల ప‌ట్ల‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ రాసిన లేఖకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి తక్షణం స్పందించారు. మెదక్ జిల్లాలో ప్రతి ఎకరాకు 8 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్ల వరకు పెంచుతూ జొన్నలను కొనుగోలు చేయాలని కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మెదక్ జిల్లాలో జొన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement