Monday, April 29, 2024

భారీగా బంగారం ప‌ట్టివేత‌

నిత్యం ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. రూ. 86 ల‌క్ష‌ల విలువైన 1.64 కిలోల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళ వ‌ద్ద బంగారం స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. లోదుస్తులు, సాక్సులో బంగారం దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement