Monday, April 29, 2024

మోదీకి క్లీన్ చిట్ ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామం : అమిత్ షా

గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై కొంద‌రు కావాల‌నే విష ప్ర‌చారం చేశార‌న్నారు. ఈ కేసుపై సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు. సిట్ విచార‌ణ‌ను మేము ప్ర‌భావితం చేయ‌లేద‌ని, ఎలాంటి ధ‌ర్నాల‌కు కూడా పిలుపునివ్వ‌లేద‌న్నారు. కొంద‌రు ఆరోప‌ణ‌ల‌ను బాగా ప్ర‌చారం చేశార‌ని, ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో అల్ల‌ర్లు జ‌ర‌గ‌లేద‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింద‌న్నారు. ఒక్క‌మాట మాట్లాడ‌కుండా మోదీ 19 ఏళ్లు పోరాడారు అని, ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నా మోదీ స‌హ‌క‌రించాడ‌ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement