Friday, May 17, 2024

దాదా సేఫ్.. నిలకడగా గంగూలీ ఆరోగ్యం..

కరోనా బారినపడిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ హెల్త్‌ బులిటెన్‌ను కోల్‌కతాలోని వుడ్‌లాండ్‌ ఆస్పత్రి యాజమాన్యం బుధవారం విడుదల చేసింది. ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నామని తెలిపింది. జ్వరం లేదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవని, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రకటించింది.

రాత్రంతా బాగానే నిద్రపోయారని, భోజనం కూడా చేశారని చెప్పుకొచ్చింది. భారత్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో సోమవారం వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ఆయన రెండు డోసుల వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement