Tuesday, May 14, 2024

Peace Prize – గీతా ప్రెస్‌ కు గాంధీ శాంతి పురస్కారం

న్యూ ఢిల్లీ – జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచురణ కర్త , ఖరగ్ పూర్ కి చెందిన గీతా ప్రెస్ కు లభించింది.

..

అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష కృషికి గుర్తింపుగా గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని జ్యూరీ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు తెలిపింది..

1923లో ఆరంభమైన గీతాప్రెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా విలసిల్లుతోంది. 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి రికార్డు నెలకొల్పింది. వీటిలో దాదాపు 16.21కోట్లు శ్రీమద్‌ భగవద్గీత పుస్తకాలే ఉండటం విశేషం. గీతాప్రెస్‌ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవలో ఆ సంస్థ కృషికి దక్కిన గొప్ప గుర్తింపు అని కేంద్రం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement