Monday, April 29, 2024

AP | పోలీసుల నుంచి తప్పించుకున్న రిమాండ్​ ఖైదీ.. ఏడుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

ఏపీలో ఓ రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనలో ఏడుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్​ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏడుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రిమాండ్ ఖైదీ నాగిరెడ్డి ఈ నెల 15వ తేదీన పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు.

ఓ కేసులో నాగిరెడ్డిని పీటీ వారెంట్ పై ధార్వాడ నుంచి కడప జిల్లాకు తీసుకువచ్చారు. జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచి తిరిగి తీసుకెళ్తుంటే అతను పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. కాగా, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నాగిరెడ్డిపై 30కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో ఓ కిడ్నాప్ కేసు, పలు చోరీ కేసులున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement