Sunday, April 28, 2024

WC Final | స్టేడియం కిటకిట.. హోటళ్లకు కటకట.. అహ్మదాబాద్ లో అభిమానుల పాట్లు…

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా…. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2003 ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కప్పును ఒడిసిపట్టాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని తేలిపోయింది.

ఈ మెగా టోర్నీ విజేత‌ల‌ను నిర్ణ‌యించే ఉత్కంఠ బ‌రిత‌మైన‌ మ్యాచ్ 19న (ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. కాగా, ఈ ఫైన‌ల్ క్లాష్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తికా ఎదురుచూస్తుంటారు. ఇక దీంతో అహ్మదాబాద్‌లో హోటల్‌ బుకింగ్‌లు జోరందుకున్నాయి.

- Advertisement -

అక్టోబరు 15న భారత్‌, పాక్‌ మ్యాచ్‌ సమయంలో అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు వాటికి డబుల్‌గా పెరిగాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఒకరోజు బస చేయాలంటే అక్షరాల లక్ష రూపాయలు చెల్లించాల్సిందే.

ప్రస్తుతం ఇక్కడ బేసిక్‌ హోటల్‌ రూమ్‌ ధరనే ఒక రాత్రికి రూ.10వేలుగా ఉంది. ఇక, ఫోర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో గది అద్దెకు తీసుకోవాలంటే ఒక రాత్రికి రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇంకొన్ని లగ్జరీ హోటళ్లలో అయితే రూమ్‌ ఛార్జీ రూ.24వేల నుంచి ఏకంగా రూ.2,15,000కు చేరాయి. అహ్మదాబాద్‌కు విమాన టికెట్‌ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్లలో టికెట్‌ ధరలు 200 నుంచి 300శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement