Tuesday, May 7, 2024

Breaking: ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో డీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురికి గాయాలు

ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జ‌రిగింది. ఆదివారం సుల్తానాబాద్ బస్టాండ్ లోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను డీకొట్టగా ఆటో వెళ్లి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరితోపాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement