Thursday, April 25, 2024

National : షాట్ సర్య్కూట్‌తో నలుగురు చిన్నారులు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మీరటర్ జిల్లా పల్లవ్‌పురంలో చోటు చేసుకుంది.

- Advertisement -

పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడిపురం జనతా కాలనీలోని ఓ ఇంట్లో భార్యభర్తలు, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, అందులో ఒక బాలుడు సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ షిచితా సింగ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడగా.. నలుగురు చిన్నారుల శరీరాలు 70 శాతం కాలిపోయాయి. ఈ మేరకు చికిత్స నిమిత్తం వారిని స్థానికంగా ఉన్న మెడికల్ కళాశాలకు చేరవేశారు. అనంతరం ఇవాళ వారు చికిత్స పొందతూ తుది శ్వాస విడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement